Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సంతతికి చెందిన ఆర్థికవేత్తకు నోబెల్ పురస్కారం

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:43 IST)
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం మరో భారతీయుడుకి దక్కింది. 2019 సంవత్సరానికిగాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 
 
వీరిద్దరే కాకుండా మైకేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు. ప్రపంచ పేదరికాన్ని కనిష్ట స్థాయికి తగ్గించే అంశంలో ఈ త్రయం పరిశోధనాత్మక దృక్పథంతో పలు సిద్ధాంతాలకు రూపకల్పన చేసింది. వీరి కృషికి గుర్తింపుగా నోబెల్ పురస్కారం వరించింది.
 
సామాజిక ఆర్థిక శాస్త్రంలో కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. మరోవైపు, అభిజిత్ బెనర్జీ చేసిన అనేక సలహాలు, సూచనలను భారత్ వంటి పలు దేశాలు పాటించాయి. పేద విద్యార్థుల ఆర్థికస్థితి మెరుగుపరిచేందుకు ఎంతగానో దోహదపడింది. 
 
'పేదరికంతో పోరాటం' చేసినందుకుగాను అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమెర్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినట్లు స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది. 'ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ ముగ్గురి ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడతాయని' రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments