Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ టెలిఫోన్ సేవల పునరుద్ధరణ

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:15 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మళ్లీ మొబైల్ రింగ్ టోన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా మూగబోయిన మొబైల్ ఫోన్లు ఎట్టకేలకు మళ్లీ రింగ్ అవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దాదాపు 20 లక్షలకు పైగా ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్లు, ఇతర ఇంటర్నెట్ సేవలు ఇంకా అచేతన స్థితిలోనే ఉన్నాయి.
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 అధికరణను ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా టెలిఫోన్ సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తున్నారు. 
 
తాజాగా, టెలీఫోన్ సర్వీసులతో పాటు జమ్మూ కాశ్మీర్‌‌లోని 99 శాతం ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేశారు. ల్యాండ్ లైన్ సేవలు సైతం దాదాపు ఆరువారాల ముందు నుంచే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. 
 
మరోవైపు, అక్టోబరు పదో తేదీ నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించిన కొద్ది రోజులకే మొబైల్ సేవలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయని చెప్పొచ్చు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments