Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగురుతున్న విమానంలో రచ్చ.. కిటికీలను కాళ్లతో తన్నాడు..

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (17:23 IST)
passenger
గాలిలో ఎగురుతున్న విమానంలో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ నెల 14న పెషావర్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న పాకిస్థాన్‌ విమానంలో సిబ్బందితో గొడవకు దిగిన ఓ వ్యక్తి.. నానా రచ్చ చేశాడు. 
 
విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆ ప్రయాణికుడు.. కోపంతో సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు. కిటికీలను కాళ్లతో తన్నాడు. ఆ వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన విమాన సిబ్బంది.. విమానయాన చట్టం ప్రకారం అతడిని సీటుకు కట్టేశారు. అనంతరం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందించిన విమానం కెప్టెన్.. దుబాయ్ విమానాశ్రయంలో భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. విమానం దిగిన వెంటనే దుబాయ్​లో పోలీసులకు అప్పగించారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments