Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో ఘోరం - పడవ బోల్తా 76 మంది జలసమాధి

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (09:56 IST)
నైజీరియా దేశంలో మరోమారు పెను విషాదం సంభవించింది. పడవ బోల్తా పడిన 76 మంది జల సమాధి అయ్యారు. ప్రమాదంలో జరిగిన సమయంలో బోటులో 85 మంది వరకు ఉండగా, వీరిలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పడవ నియంత్రణ కోల్పోయి బోల్తాపడింది. గత కొన్ని నెలలుగా నైజీరియా దేశంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో 76 మంది చనిపోయారని నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ తెలిపారు. 
 
సమాచారం తెలుసుకున్న ఆయన తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో నదిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదం నైజీరియా దేశంలోని అనంబ్రాలో జరిగింది. 85 మంది ప్రయాణికులతో వెళుతుండగా, నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పడవ బోల్తా పడింది. రాష్ట్రంలోని ఒగబరు ప్రాంతంలో 85 మందితో వెళుతున్న పడవ ఒకటి నదిలో మునిగిపోయిందని, ఈ ప్రమాదంలో 76 మంది మృతి చెందారని అధ్యక్షుడు మహ్మద్ బుహారీ కార్యాలయం అధికారింగా వెల్లడించింది. 
 
కాగా, ఈ దేశంలో ఈ తరహా ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, వేగం, పేలవమైన నిర్వహణ వంటి చర్యల కారణంగా ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇక్కడ వర్షకాలం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 300 మంది వరకు ఈ తరహా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments