Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌ వరదలు.. 44మంది మృతి.. రికార్డు స్థాయి వర్షాలతో..

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (10:25 IST)
న్యూయార్క్‌ను వరదలు ముంచెత్తాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన వరదల కారణంగా 44మంది ప్రాణాలు కోల్పోయారు. రికార్డు స్థాయిలో వర్షాలు కురువడంతో న్యూయార్క్‌ నగరమంతా వరదల్లో చిక్కుకుంది. వీధులన్నీ నదులను తలపించాయి. 
 
నీరు ఫ్లాట్‌ ఫారమ్‌ల్లోని ట్రాక్‌లపైకి ప్రవహించడంతో సబ్‌ వే సర్వీసులను నిలిపివేశారు. లాగార్డియా, జెఎఫ్‌కె, నెవార్క్‌ విమానాశ్రయాల్లో వందలాది విమాన సర్వీసులను నిలిపివేశారు. న్యూయార్క్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు చూస్తున్నానని 50 ఏళ్ల వ్యక్తి.. రెస్టారెంట్‌ యాజమాని తెలిపారు. ఆయన రెస్టారెంట్‌ బేస్‌మెంట్‌ మూడు అంగుళాల నీటిలో మునిగిపోయింది. ఈ అకాల వర్షాలపై అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. 
 
ఐదా తుఫాన్‌ ధాటికి జరిగిన భారీ నష్టం పట్ల సాయం చేయడానికి దేశమంతా సిద్ధంగా ఉందని లూసియానా పర్యటనకు ముందు తెలిపారు. న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీనీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. న్యూజెర్సీలో భారీ వానలకు కనీసం 23 మంది చనిపోయి ఉంటారని గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ విలేకరులతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments