Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 వరకు విదేశీయుల వీసా గడువు పెంపు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (08:16 IST)
భారత్​లో ఉన్న విదేశీయుల వీసా గడువును  కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. గడువు ముగిసేంతవరకు సాధారణ వీసా లేదా ఈ-వీసా కలిగిన వారు.. ఎలాంటి ఓవర్ స్టే పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
 
అఫ్గాన్ పౌరులకు సైతం.. ఈ గడువు వర్తిస్తుందని తెలిపింది. కొవిడ్​ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దై.. స్వదేశానికి వెళ్లలేక పోయిన విదేశీయులకు వీసా గడువు పొడిగించింది భారత ప్రభుత్వం. 
 
అంతకుముందు ఆగస్టు 31వరకు ఉన్న గడువును.. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  అన్ని రకాల వీసాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
 
మార్చి, 2021 వరకు వివిధ రకాల వీసాల ద్వారా భారత్​కు వచ్చి కరోనా కారణంగా విమాన సర్వీసులు రద్దై.. భారత్​లోనే చిక్కుకున్న వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికార ప్రతినిధి తెలిపారు. 
 
భారత్​లో ఉన్న విదేశీయులకు.. ఎలాంటి ఓవర్​ స్టే పెనాల్టీ విధించకుండా వీసా గడువును పొడిగిస్తున్నామన్నారు. విదేశీయులు.. ఫారనర్స్ రీజనల్​​ రిజిస్ట్రేషన్​ కార్యాలయాల్లో(ఎఫ్​ఆర్​ఆర్​ఓ) ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.

ఎవరికైనా సెప్టెంబర్ 30 తర్వాత కూడా.. వీసా గడువు కావాలంటే ఎఫ్​ఆర్​ఆర్​ఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసు కోవాలన్నారు. అఫ్గాన్ పౌరులకు కూడా.. ఇదివరకు చెప్పిన విధంగానే గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments