Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 వరకు విదేశీయుల వీసా గడువు పెంపు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (08:16 IST)
భారత్​లో ఉన్న విదేశీయుల వీసా గడువును  కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. గడువు ముగిసేంతవరకు సాధారణ వీసా లేదా ఈ-వీసా కలిగిన వారు.. ఎలాంటి ఓవర్ స్టే పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
 
అఫ్గాన్ పౌరులకు సైతం.. ఈ గడువు వర్తిస్తుందని తెలిపింది. కొవిడ్​ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దై.. స్వదేశానికి వెళ్లలేక పోయిన విదేశీయులకు వీసా గడువు పొడిగించింది భారత ప్రభుత్వం. 
 
అంతకుముందు ఆగస్టు 31వరకు ఉన్న గడువును.. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  అన్ని రకాల వీసాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
 
మార్చి, 2021 వరకు వివిధ రకాల వీసాల ద్వారా భారత్​కు వచ్చి కరోనా కారణంగా విమాన సర్వీసులు రద్దై.. భారత్​లోనే చిక్కుకున్న వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికార ప్రతినిధి తెలిపారు. 
 
భారత్​లో ఉన్న విదేశీయులకు.. ఎలాంటి ఓవర్​ స్టే పెనాల్టీ విధించకుండా వీసా గడువును పొడిగిస్తున్నామన్నారు. విదేశీయులు.. ఫారనర్స్ రీజనల్​​ రిజిస్ట్రేషన్​ కార్యాలయాల్లో(ఎఫ్​ఆర్​ఆర్​ఓ) ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.

ఎవరికైనా సెప్టెంబర్ 30 తర్వాత కూడా.. వీసా గడువు కావాలంటే ఎఫ్​ఆర్​ఆర్​ఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసు కోవాలన్నారు. అఫ్గాన్ పౌరులకు కూడా.. ఇదివరకు చెప్పిన విధంగానే గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments