Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం... నలుగురు భారతీయులతో సహా 16 మంది మృతి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (07:51 IST)
దుబాయ్‌లోని అల్ రస్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 16 మంది మృత్యువాతపడ్డారు. ఈ మంటల్లో కాలిపోయిన వారిలో కేరళ, తమిళనాడు వాసులతో పాటు పాకిస్థాన్, నైజీరియా ప్రజలు ఉన్నారు. భవన నిర్మాణంలో తగిన రక్షణ చర్యలు పాటించకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో సంభించినట్టు గల్ఫ్ న్యూస్ తెలిపింది. 
 
భవనంలోని నాలుగో అతస్తులో సంభవించిన మంటలు క్రమంగా ఇతర చోట్లకు కూడా వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దుబాయ్ సివిల్ ఢిపెన్స్ హెడ్‌క్వార్టర్స్‌ సిబ్బంది నిర్వాసితులను అక్కడకి నుంచి తరలించారు. 
 
ఈ ఘటనలో మరణించిన నలుగురు భారతీయుల్లో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడు చెందిన ఇద్దరు పౌరులు ఉన్నట్టు దుబాయ్ స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments