Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం.. మంటల్లో దహనమైన ప్రయాణికులు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (14:13 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోరం జరిగింది. బలూచిస్థాన్ ప్రాంతంలో లాస్ బెలాలో కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి కాలువలో పడింది. దీంతో బస్సుకు నిప్పు అంటుకున్నాయి. ఈ కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనేక మంది మంటల్లో కాలిపోయారు. 
 
ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా 48 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. బస్సు అదుపుతప్పి కాలువలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చాలా మంది కాలిపోయారని, ఫలితంగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని సహాయక సిబ్బంది తెలిపారు. 
 
కాగా, క్వెట్టా నుంచి కరాచీకి వెళుతుండగా, బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. కొండపై మూల మలుపు వద్ద ఉన్న వంతెన వద్ద బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments