Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం.. మంటల్లో దహనమైన ప్రయాణికులు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (14:13 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోరం జరిగింది. బలూచిస్థాన్ ప్రాంతంలో లాస్ బెలాలో కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి కాలువలో పడింది. దీంతో బస్సుకు నిప్పు అంటుకున్నాయి. ఈ కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనేక మంది మంటల్లో కాలిపోయారు. 
 
ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా 48 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. బస్సు అదుపుతప్పి కాలువలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చాలా మంది కాలిపోయారని, ఫలితంగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని సహాయక సిబ్బంది తెలిపారు. 
 
కాగా, క్వెట్టా నుంచి కరాచీకి వెళుతుండగా, బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. కొండపై మూల మలుపు వద్ద ఉన్న వంతెన వద్ద బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments