Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:11 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో పదకొండు మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. 
 
ఘటనా స్థలంలో రెండు హ్యాండ్ గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కాల్పులకు పాల్పడిన వారిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. పైగా, కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులకు ట్విటర్‌ ద్వారా హెచ్చరికలు చేశారు. దీంతో ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.
 
గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసుల ప్రకారం, డౌన్‌టౌన్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్ పరిసరాల్లో గుమిగూడిన జనంపై కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సౌత్ స్ట్రీట్‌లో పెద్ద జనసమూహం ఉన్న సమయంలో దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments