Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు 31 యేళ్ళ జైలు

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (22:08 IST)
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు మొత్తం 31 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది. ఉగ్రవాదులకు నిధులు మళ్లించారనే రెండు వేర్వేరు కేసుల్లో జమాత్ ఉద్ దవా అధినేతకు పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. 
 
అలాగే, రూ.3.40 లక్షల అపరాధం కూడా విధించింది. అలాగే, హఫీజ్ ఆస్తులను స్తంభింపజేయాలని ఆదేశించింది. దీంతో హఫీజ్ సయీద్ మసీదు, మదర్సాను పాక్ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. గత 2020లో టెర్రరిస్టులకు మద్దతిచ్చినందుకు ఉగ్రవాద నేతకు 15 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. 
 
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది చనిపోయారు. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం నిరంతరం అభ్యర్థించినప్పటికీ, పాకిస్థాన్ తిరస్కరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కోర్టు ఆయనకు ఏకంగా 31 యేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునివ్వడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments