Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు 31 యేళ్ళ జైలు

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (22:08 IST)
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు మొత్తం 31 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది. ఉగ్రవాదులకు నిధులు మళ్లించారనే రెండు వేర్వేరు కేసుల్లో జమాత్ ఉద్ దవా అధినేతకు పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. 
 
అలాగే, రూ.3.40 లక్షల అపరాధం కూడా విధించింది. అలాగే, హఫీజ్ ఆస్తులను స్తంభింపజేయాలని ఆదేశించింది. దీంతో హఫీజ్ సయీద్ మసీదు, మదర్సాను పాక్ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. గత 2020లో టెర్రరిస్టులకు మద్దతిచ్చినందుకు ఉగ్రవాద నేతకు 15 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. 
 
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది చనిపోయారు. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం నిరంతరం అభ్యర్థించినప్పటికీ, పాకిస్థాన్ తిరస్కరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కోర్టు ఆయనకు ఏకంగా 31 యేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునివ్వడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments