Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (13:18 IST)
పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ అమెరికా ఖండమైన పెరూలో ఆదివారం ఉదయం ఘోర విపత్తు జరిగింది. పెరూ దేశ రాజధాని లిమాలో కొతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి భారీ లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే 24 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. డెవిల్స్ కర్వ్‌గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 24 మంది చనిపోయినట్టు సహాయక సిబ్బంది వెల్లడించింది. మృతుల్లో కరేబియన్ దేశమైన హైతీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దుల్లోని టుంబేస్‌కు చేరుకోవాల్సి వుంది. కానీ, బస్సు ఆర్గానోస్ నగరం సమీపంలోని కొండపై ఉండే ప్రమాదకరమలుపు నుంచి పడిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments