Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు.. ఎందుకంటే?

Dead Body
, శనివారం, 14 జనవరి 2023 (15:29 IST)
Dead Body
పోస్టుమార్టం వద్దంటూ మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో  పోస్టుమార్టం వద్దంటూ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు. పోలీసులు అతడిని వెంబడించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 
 
వివరాల్లోకి వెళితే.. తంగళ్లపల్లి మండలం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున భర్త మృతి చెందాడని తెలుసుకుని బోరుమంది. ఇక చేసేదిలేక కుటుంబసభ్యులు ఉదయం అంత్యక్రియలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. 
 
అందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఇంతలో మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహన్ని భుజంపై వేసుకుని మలయ్య గుండెపోటుతో చనిపోయాడని.. ఆయన మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదంటూ పరుగులు తీశాడు. కానీ పోలీసులు అతడిని వెంబడించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల..