Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత... 22 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (08:57 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. ఓ దండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది చనిపోయారు. ఈ దారుణం మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి జరిగింది. ఓ బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
సెమీ ఆటోమేటిక్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల మేరకు.. ఈ ఘటనలో 22 మంది చనిపోగా, మరో 60 మంది గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాల్పులు జరిపిన ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు, ఈ దారుణ ఘటనపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ట్విట్టర్ వేదికగా తన విచారం వ్యక్తం చేస్తూ, తాను తీవ్రమైన భయభ్రాంతులకు గురైనట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments