Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు - 19 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 4 జులై 2022 (09:33 IST)
పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది వరకు చనిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలో సంభవించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
'బస్సు క్వెట్టా సమీపానికి రాగానే ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీశాం. గాయపడ్డ మరో 11 మందిని ఆస్పత్రిలో చేర్పించాం' అని అసిస్టెంట్‌ కమిషనర్‌ సయ్యద్‌ మెహ్తబ్‌ షా వెల్లడించారు. 
 
అయితే, ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర అతివేగం, భారీ వర్షమే ప్రధాన కారణమై వుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. బస్సు ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments