Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గో ట్రక్కు బీభత్సం.. 19 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (15:13 IST)
మెక్సికో దేశంలో ఓ కార్గో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఇందులో ఏకంగా 19 మంది వరకు మృత్యువాతపడ్డారు. అనేక మంది గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ మెక్సికోలోని హైవే పై ఉన్న ఓ టోల్ బూత్ వ‌ద్ద శ‌నివారం ఓ వ‌స్తువుల‌ను ర‌వాణా చేసే కార్గో ట్ర‌క్కు అదుపు త‌ప్పి ప‌లు వాహ‌నాల‌పైకి దూసుకెళ్లింది. 
 
ఈ క్ర‌మంలో అక్క‌డ మంట‌లు చెల‌రేగి ప‌లు వాహ‌నాలు ద‌గ్థం అయ్యాయి. మంట‌ల్లో చిక్కుకుని 19 మంది స‌జీవ ద‌హ‌నమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ కార్గో ట్రక్కు బ్రేకులు ఫెయిలవడం కావ‌డం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments