Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది మృత్యువాత

Advertiesment
Gujarat
, సోమవారం, 9 ఆగస్టు 2021 (14:33 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ట్రక్కు ఒక్కటి గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. సోమవారం వేకువజామున ఈ దారుణం జరిగింది. 
 
అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్‌రారు కథనం మేరకు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో క్రేన్‌ను తరలిస్తుండగా ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. 
 
ఆ సమయంలో గుడిసెలో పదిమంది నిద్రిస్తుండగా వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఎనిమిదిమంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
మరణించినవారిలో ఇద్దరు వృద్ధులతో పాటు 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్ సెంటర్లో కనుక ఎక్కవ డబ్బులు వసూలు చేస్తే…?