Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ.. 700మంది మృతి.. 30వేల మందికి కరోనా

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (17:01 IST)
అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరి కారణంగా అమెరికాలో 30వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. 700 మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ను మొదటి నుంచి తేలిగ్గా తీసుకున్న ట్రంప్.. వైద్య నిపుణుల సూచనలను కూడా లెక్క చేయకుండా ఎన్నికల నేపథ్యంలో భారీ ప్రచార ర్యాలీలను నిర్వహించారు.
 
కాగా.. ట్రంప్ నిర్వహించిన 18 ఎన్నికల ర్యాలీల కారణంగా సుమారు 30వేల మందిపైగా ప్రజలు కరోనా బారినపడ్డారని.. ఇందులో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేశారు.
 
'ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కొవిడ్-19: ది కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్' అంశంపై స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ పరిశోధనలు జరిపి దానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 మధ్య డొనాల్డ్ ట్రంప్ 18 ఎన్నికల ర్యాలీలను నిర్వహించినట్లు నివేదికలో తెలిపింది. ఈ ర్యాలీల కారణంగా 30వేల మంది కరోనా బారినపడ్డట్టు.. 700 మంది కరోనా కాటుకు బలైనట్టు పేర్కొంది. 
 
అంతేకాకుండా భారీ జనసమూహాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందన్న వైద్య నిపుణుల వాదనను తాము సమర్థిస్తున్నట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ నివేదికపై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ స్పందించారు. 'ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని పట్టించుకోరు. సొంత మద్దతుదారుల గురించి కూడా ఆయన ఆలోచించరు' అంటూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments