Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్జింగ్‌లో స్మార్ట్‌ఫోన్.. పాటలు వింటూ నిద్రించిన బాలిక.. చివరికి ఏమైందంటే?

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (19:18 IST)
స్మార్ట్ ఫోన్లు లేకుండా ఒక సెకను కూడా వుండలేని వారు ఎందరో వున్నారు. స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఓ 14 ఏళ్ల బాలిక సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించింది. చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘటన కజగస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించిన మహిళ.. ఆ సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో ప్రాణాలు కోల్పోయింది. కజగస్థాన్‌కు చెందిన బాస్పేట్ అనే గ్రామానికి చెందిన ఆల్వా అప్జల్ బెక్ (14) అనే బాలిక.. ఆదివారం రాత్రి సెల్ ఫోనులో పాటలు వింటూ నిద్రించింది. 
 
తెల్లవారైనా చాలాసేపటికి యువతి నిద్ర నుంచి మేల్కోకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు ఆ యువతిని నిద్రలేపారు. ఆపై ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువతిని పరిశోధించిన వైద్యులు అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో.. 14 ఏళ్ల బాలిక రాత్రి నిద్రించే ముందు సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టింది. 
 
తలకు పక్కనే ఆ ఫోనును వుంచి.. హెడ్ ఫోన్ ద్వారా పాటలు వింటూ నిద్రించింది. సెల్ ఫోన్‌ చాలాసేపటికీ ఛార్జింగ్‌లో వుండటం ద్వారా బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో బాలిక తలకు గాయమై ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments