భూమివైపు వేగంగా దూసుకొస్తోన్న గ్రహశకలం.. ప్రమాదకరమేనా?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (22:03 IST)
భూమివైపు ఓ గ్రహశకలం వేగంగా దూసుకొస్తోంది. సుమారు 1.3 కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న గ్రహశకలం మార్చి 4వ తేదీన భూమికి సమీపానికి వస్తుందని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ (జేపీఎల్) ప్రకటించింది. భూమికి 49,11,298 కిలోమీటర్ల చేరువగా వచ్చే ఈ గ్రహశకలంతో ప్రమాదకరమేనని జేపీఎల్ తెలిపింది. 
 
138971 (2001 సీబీ21) పేరుతో పిలిచే ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు జేపీఎల్ పేర్కొంది. కేవలం 400 రోజుల్లోనే ఒక పర్యాయం చుట్టి వస్తోందని.. గంటకు 43,236 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నట్టు వెల్లడించింది.
 
చివరిగా ఇదే గ్రహశకలం 2006లో భూమికి చేరువగా వచ్చి వెళ్లింది. అప్పుడు 71,61,250 కిలోమీటర్ల సమీపానికి వచ్చింది. అంటే ఈ సారి ఇంకొంచెం దగ్గరగా రానుంది. ఈ ఏడాది మార్చి 4 తర్వాత.. మళ్లీ 2043లో ఇదే గ్రహశకలం భూమికి చేరువగా వస్తుందని జేపీఎల్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments