స్లిమ్‌గా ఉండాలంటే రోజూ ఓ కప్పు పెరుగు తింటే చాలు...

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (15:14 IST)
స్లిమ్‌గా ఉండేందుకు మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. కొంత మంది ఆహారం తక్కువగా తీసుకుంటారు. కడుపు మాడ్చుకుంటారు. కానీ అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా పౌష్టికాహారం తింటే చాలా మంచిది. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినవచ్చు. 
 
పెరుగు తింటే స్థూలకాయం వస్తుందని చాలా మంది అపోహ. కానీ అది పొరపాటు. ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలో కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 
 
పెరుగులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. పెరుగును తరచుగా తీసుకుంటే ఇతర చిరుతిండి పదార్థాలు తీసుకోవాలనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. చిరుతిండి పదార్థాలు ఎక్కువగా తినడం వలన అధికంగా బరువు పెరుగుతారు, దాంతో కడుపు కూడా పెరుగుతుంది. 
 
కనుక పెరుగును తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. 300 గ్రాముల పెరుగులో 200 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెప్తున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపుటకు ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న ఇమ్మడి రవి పేరు.. టికెట్ రేట్లు పెంచేస్తే?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు : వైకాపా అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments