Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నగంటి ఆకు, మిరియాల పొడితో కూర చేసుకుని తీసుకుంటే..?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (17:25 IST)
గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి కంటి కిందట నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. దాంతో కళ్లు దురదగా, మంటగా ఉంటాయి. అందువలన ప్రతిరోజూ గంట ఓసారి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అప్పుడే అలసట, ఒత్తిడి తొలగుతుంది. దాంతో కళ్ల దురదలు తగ్గుతాయి. 
 
పొన్నగంటి ఆకును ఉడికించుకుని అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. పొన్నగంటి ఆకుతో తాలింపు తయారుచేసి ప్రతిరోజూ సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి ఆకు, కందిపప్పు బాగా ఉడికించుకుని అందులో కొద్దిగా నెయ్యి, ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు వేసి మరికాసేపు ఉడికించి సేవిస్తే నెలరోజుల్లో స్లిమ్‌గా మారుతారు.
 
ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారాల్లో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండడంతో అవి రక్తంలో కలిసిపోతున్నాయి. దాంతో రక్తం అశుభ్రమైపోతుంది. పొన్నగంటి కూర తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. పొన్నగంటి ఆకు, పెసరప్పు బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత నూనెలో ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి వేసి వేయించి పొన్నగంటి ఆకులో వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఈ కూరను అన్నంలో కలిపి తీసుకుంటే దాని రుచే వేరు. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments