Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 మంది అతిథులతో నిరాడంబరంగా సీతారామ కళ్యాణం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (17:27 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబ‌రంగా జ‌రిగాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు పూర్తిచేశారు. 
 
ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్ శ్రీసీతారాముల స్వామివారికి ముత్యాల త‌లంబ్రాలు, ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.  వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జ‌రిగింది.
 
ప్రతియేటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణ వేడుక నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆల‌య‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.
 
మరోవైపు, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ హాజరుకావొద్దని ప్రభుత్వం సూచించింది. దీంతో భక్తులు లేకుండానే కల్యాణ వేడుకలను పూర్తిచేశారు. కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో సీతారాముల కల్యాణ వేడుకలు ముగిశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈడీని ఏర్పాటు చేసి తప్పు చేసిన కాంగ్రెస్.. ఇపుడు శిక్ష అనుభివిస్తోంది : అఖిలేష్ యాదవ్

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

14-04-2025 సోమవారం ఫలితాలు : పెట్టుబడులకు తరుణం కాదు...

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments