Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇవి తినండి..

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (09:20 IST)
ఇపుడు ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే వెన్నునొప్పి మటుమాయం కావడమేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకున్నట్టయితే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఆహార పదార్థాలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
చేపలు : చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు చేపలను తీసుకున్నట్టయితే శరీరానికి విటమిన్ డి అందుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా మారి వెన్నునొప్పితో పాటు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. 
 
పాలు : మంచి బలవర్ధక ద్రవ పదార్థం. వీటిలో విటమిన్ డితో పాటు.. క్యాల్షియంలు పుష్కలంగా ఉంటాయి పాలను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వెన్ను నొప్పితో పాటు ఇతర నొప్పులు కూడా మాయమైపోతాయి. చీజ్‌లోనూ క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఆరగించడం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుతాయి. 
 
కోడిగుడ్లు 
కోడిగుడ్లలో విటమిన్ డి శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చసొనలోనే ఇది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పచ్చసొనతో రోజూ ఒక కోడిగుడ్డును ఆరగించినట్టయితే వెన్ను నొప్పి నుంచి పూర్తిగా విముక్తులు కావొచ్చు. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments