Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి మృతి చెందిన శోకంలో పొటాటో చిప్స్ తిని.. 160 కేజీలు పెరిగింది..?

Advertiesment
తండ్రి మృతి చెందిన శోకంలో పొటాటో చిప్స్ తిని.. 160 కేజీలు పెరిగింది..?
, మంగళవారం, 27 నవంబరు 2018 (14:58 IST)
బ్రిటన్‌లో నివసిస్తున్న ఓ మహిళ 160 కేజీల బరువుతో నానా తంటాలు పడుతోంది. శరీరంలో కొవ్వు కరిగిపోయినా.. చర్మం వదులుగా మిగిలిపోవడంతో ఇబ్బందులు పడుతుంది. ఈ తంటా తండ్రి మరణానికి తర్వాతే వచ్చిందని బాధిత మహిళ చెప్తోంది.


వివరాల్లోకి వెళితే.. తన 24 ఏళ్ల వయస్సులో తన ప్రేమికునితో కలిసి స్టెఫ్ అనే మహిళ స్పెయిన్‌కు ట్రిప్పేసింది. ఆ రోజున ఆయన తండ్రి ఆలన్‌కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. కానీ అదే రోజున స్టెఫ్‌కు తల్లి ఫోన్ చేయడం.. తండ్రి ఇకలేరని చెప్పడంతో స్టెఫ్ షాక్ తింది. 
 
సాధారణంగా ఎవరైనా మృతి చెందితే శోకంలో ఆహారం తీసుకోవడం మానేయడం చూసేవుంటాం. కానీ స్టెఫ్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. తండ్రి మరణించిన శోకంలో పొటాటో చిప్స్‌ను అదేపనిగా స్టెఫ్ లాగించింది.

ఇలా రెండేళ్ల పాటు పొటాటో చిప్స్‌ను తినడాన్ని బాగా అలవాటు చేసుకున్న స్టెఫ్.. దానికి బానిసగా మారిపోయింది. దీంతో 160 కిలోలు పెరిగింది. ఆపై తల్లి ఇచ్చిన సూచనల మేరకు వ్యాయామాలు చేసింది. ఆపై బరువు తగ్గినా.. కొవ్వు కరిగినా.. చర్మం వదులుగా వుండటంతో స్టెఫ్ ఇబ్బంది పడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీ బ్రహ్మచారినా..? లోలోపల ఏం జరుగుతుందో?: పవన్