Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు(బీపీ)ను అదుపులో ఉంచే పండ్లు ఏంటి?

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (08:22 IST)
హైటెక్ జీవనశైలిలో వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా చిన్నవయసులోనే బీపీ, షుగర్, ఉబకాయం వంటి వ్యాధులబారిన పడుతున్నారు. ముఖ్యంగా పెక్కుమంది రక్తపోటు బారిన పడుతున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి హై బీపీ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. బీపీని అదుపులో ఉంచుకోనిపక్షంలో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల బీపీని అదుపులో ఉంచేలా ఆహార పదార్థాలు తీసుకోవాలి. 
 
ప్రతీ సంవత్సరం హై బీపీ వల్ల తొమ్మిది మిలియన్ల మంది మరణిస్తున్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. బీపీ ఎక్కువ ఉందని బెంగపడాల్సిన అవసరం లేకుండా మనకు ప్రతి నిత్యం అందుబాటులో ఉండే పండ్లను తీసుకుంటే సరిపోతుంది.
 
* సర్వసాధారణంగా ఎక్కడ చూసినా కంటికి కనిపించే పండ్లు అరటిపళ్లు. వీటిని ఆరగించడం ఎంతో మంచిది. ఇందులోని పొటాషియం శరీరానికి మంచి చేస్తుంది. అరటిపండ్లు హైబీపీ రాకుండా సాధారణ రక్తప్రసరణ జరగటానికి దోహదపడతాయి.
 
* ప్రతి రోజూ మీగడ తీసిన పాలు తాగాలి. ఇందులోని కాల్షియం, విటమిన్‌-డి ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి. దీంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యల్ని నివారించాలంటే స్కిమ్డ్‌ మిల్క్‌ తాగితే ఫలితం ఉంటుంది.
 
* పుచ్చకాయ కేవలం ఎండాకాలంలో వేడిని తగ్గించడానికి పనిచేయడమే కాకుండా ఇందులో దొరికే పొటాషియం, పైబర్‌, విటమిన్‌-ఎ వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు.
 
* విటమిన్‌-సి, ఫైబర్‌ ఉండే నారింజ పండు బ్లడ్‌ప్రెషర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. నారింజ పండ్లు తినొచ్చు లేదా వాటిని జ్యూస్‌ చేసుకుని తాగినా హైబీపీ ఉండేవారికి మంచిది.
 
* ఫోలిక్‌ ఆసిడ్‌, ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్‌-ఇ పుష్కలంగా ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలు తినటం వల్ల బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
 
* బీపీ ఎక్కువగా ఉండేవారు పాలకూరని తినాలి. ఇందులో తక్కువ క్యాలరీస్‌, ఎక్కువ ఫైబర్‌ ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. గుండె రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments