Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండు ఆడవాళ్ళకు మంచిది.. ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (07:43 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అరటి పండు ఒకటి. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు. భోజనం చేసిన తర్వాత ఈ పండును ఆరగించే వారే ఎక్కువ. బాగా ఆకలిగా ఉన్నపుడు ఒక్క అరటి పండుతో క్షుద్బాధను తీర్చుకోవ్చు. అలాంటి అరటి పండు ఆరగించడం వల్ల స్త్రీలకు ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
సాధారణంగా 45 యేళ్లు పైబడిన స్త్రీలు మోనోపాజ్‌ (బహిష్టు ఆగిపోవడం) దశలోకి అడుగుపెడతారు. ఇలాంటి స్త్రీలు అరటిపళ్లు ఆరగిస్తే చాలా మంచిదట. అది వాళ్లల్లో స్ట్రోక్‌ సమస్యలను చాలా మేరకు తగ్గిస్తుందని తాజాగా నిర్వహించి ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
ఈ దశలో ఉండే మహిళలు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల స్ట్రోక్‌ను అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం కోసం మెనోపాజ్‌లో ప్రవేశించిన మొత్తం 90,137 మహిళలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ మహిళలందరూ 50-79 వయస్సు వాళ్లు. 11 సంవత్సరాల పాటు ఈ స్టడీని కొనసాగించారు. 
 
స్త్రీలు పొటాషియం ఎక్కువ ఉండే ఆహారపదర్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని, అదేసమయంలో ఎక్కువ పొటాషియం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదట. అలాచేస్తే గుండెకు హానికరమని వారు హెచ్చరిస్తున్నారు. పోషకవిలువలున్న ఆహారాన్ని వీరు బాగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని వారు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments