Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి జావ తాగితే అవన్నీ తగ్గిపోతాయ్...

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (10:06 IST)
చలికాలం నాటి చల్లటి వాతావరణంలో రోజువారి ఆహారంగా రాగులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తుంది. దీనిలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ అధిక బరువును తగ్గించుటకు మంచి ఔషధంగా సహాయపడుతాయి. రాగులలోని మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
1. రాగుల్లోని పీచు పదార్థం, ప్రోటీన్స్ రక్తపోటును తగ్గిస్తాయి. రాగులను నూనెలో వేయించి పొడిచేసి గ్లాస్ పాలలో కలిపి తీసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. 
 
2. రాగులలో తయారుచేసిన గంజి, జావ వంటి ఆహార పదార్థాలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తొలగి మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. దాంతో పాటు క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధించే లక్షణాలు రాగుల్లో అధిక మోతాదులో ఉన్నాయి. 
 
3. పాలిచ్చే తల్లులు ప్రతిరోజూ రాగుల పొడిని అన్నం కలిపి సేవిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుటకు రాగులు చాలా దోహదపడుతాయి. తద్వారా రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. 
 
4. ఆకలి నియంత్రణకు చాలా మంచివి. రాగులు తరచుగా తీసుకోవడం వలన ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. 
 
5. చాలామందికి చిన్న వయసులోనే చర్మం ముడతలుగా ఉంటుంది. అలాంటప్పుడు రాగులలో చేసిన జావ క్రమంగా తీసుకుంటే చర్మం ముడతలు పడకుండా యంగ్‌గా ఉంటారు. 
 
6. శరీర వేడిని తగ్గిస్తుంది. రాగులను నెయ్యిలో వేయించి పొడిచేసి అందులో కొద్దిగా చక్కెర లేదా బెల్లం సేవిస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.   

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments