Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి బఠాణీలు ఉడికించి తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (10:03 IST)
పచ్చి బఠాణీలు తరచుగా వంటకాల్లో వాడుతుంటారు. వీటిని ఏ వంటకాల్లో వేసిన ఆ వంట రుచి అంత రుచిగా ఉంటుంది. కానీ, చాలామంది ఈ బఠాణీలు తినడానికి అంతగా ఇష్టపడరు. నిజానికి పచ్చి బఠాణీలలోని ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పకుండా వీటిని తీసుకోవాలనిపిస్తుంది. అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
1. పచ్చి బఠాణీలను రాత్రి నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఉడికించి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
2. పచ్చి బఠాణీలలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకని రోజూ తీసుకోకుండా.. వారానికి రెండుసార్లు అలా సేవిస్తే ఫలితం ఉంటుంది... అదే పనిగా మాత్రం తినరాదు. ఒకవేళ అలా చేస్తే గ్యాస్ ఇబ్బంది పెడుతుంది.   
 
3. ఎదిగే పిల్లలకు పచ్చి బఠాణీలతో తయారుచేసిన వంటకాలు పెట్టాలి. అప్పుడే వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు ఇవి చిన్నారులకు బలవర్దకమైన ఆహారంగా పనిచేస్తాయి. 
 
4. అధిక బరువు గలవారు వారంలో అప్పుడప్పుడు ఈ పచ్చి బఠాణీలను ఉడికించి తీసుకుంటే.. శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు. వీటిని తరచుగా తీసుకుంటే ఆకలి నియంత్రణకు అంతగా ఉండదు. 
 
5. ఈ బఠాణీలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి అధిక బరువును తగ్గించుటకు చాలా ఉపయోగపడుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. దాంతో శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. 
 
6. కంటి చూపును మెరుగుపరుస్తాయి. రక్తహీనతను అదుపులో ఉంటుంది. ఎముకలు బలంగా ఉండాలంటే.. వారంలో రెండు లేదా మూడుసార్లు ఓ కప్పు ఉడికించిన పచ్చి బఠాణీలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments