Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదిగే పిల్లలకు ఎలాంటి పదార్థాలు పెట్టాలో తెలుసా?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (21:59 IST)
సాధారణంగా ఈ కాలంలో పిల్లలు సరియైనా పోషకాహారం తీసుకోవటం లేదు. దీనికారణంగా వీరు సన్నగా, బలహీనంగా తయారవుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు నూడుల్స్, పిజా, బర్గర్ అంటూ జంక్‌పుడ్‌కి అలవాటుపడి బలమైన ఆహార పదార్థాలను తినటం మానేస్తున్నారు. మరికొందరు డైటింగ్ పేరుతో ఏదీ తినకుండా ఉంటున్నారు. 
 
ఇలా చేయడం వలన పిల్లలలో పోషకాహారలోపం ఏర్పడి పెరుగుదల ఆగిపోతుంది. పిల్లలు కూడా బలహీనంగా తయారవుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలు సరియైన క్యాల్షియం ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోకపోవటం వలన ఎముకలలో సాంద్రత తగ్గిపోతుంది.  ఎముకలు పెళుసులాగా మారి విరిగిపోవడం, కీళ్లవాపులు రావడం జరుగుతుంది. అది ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. ఈ సమస్యను కొంతవరకూ తగ్గించాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉన్న పాలూ, పాలపదార్ధాలు, గుడ్లు, చేపలు లాంటివి క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.  
 
అలాగే కొంతమంది డైటింగ్ చేయడం వలన కొవ్వుతో పాటు కండరాల దృఢత్వము తగ్గుతుంది. కానీ కండరాలు దృఢంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అది సాధ్యం కావాలంటే మాంసకృత్తులు ఎక్కువగా ఉండే గింజలు, గుడ్లు, నూనె లాంటివి ఎక్కువగా వాడుతూ ఉండాలి. మాంసకృత్తులు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గుతూనే మాంసకృత్తులు కోల్పోకూడదు. కొవ్వు అనేది సమతులాహారంలో ఒక భాగము. శరీరానికి కొద్దిగా కొవ్వుకూడా అవసరము. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో తగినంత కొవ్వు పదార్ధాలు ఉండేలా చూసుకోవడం వలన రోజంతా చురుగ్గా ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments