Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్ష రసంతో తలనొప్పికి చెక్...

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (14:34 IST)
అనేక రకాల పండ్లు మనకు పలు రకాల పోషణను అందిస్తాయి. కొన్ని దేహదారుఢ్యాన్ని పెంచితే, మరికొన్ని ఔషధాలుగా పనిచేస్తాయి. వీటివల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాలంలో మనకు ద్రాక్షపండ్లు విరివిగా లభిస్తాయి. ద్రాక్షపండ్లలో వివిధ రకాలు ఉన్నాయి. నలుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో లభ్యమవుతాయి. ఈ పండ్లు మన ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో దోహదపడతాయి. వీటిని తరచుగా తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 
నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడేవారు రాత్రివేళలో కప్పు ద్రాక్ష పండ్లు సేవిస్తే సమస్య తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ద్రాక్ష పండ్లను మెత్తగా నలిపి పేస్ట్ చేసి అందులో చక్కెర కలుపుకుని తింటే కడుపులో మంట నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు ద్రాక్ష రసాన్ని సేవిస్తే వెంటనే మటుమాయం అవుతుంది. ద్రాక్ష తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి దానిని రోజూ పాలలో కలుపుకుని త్రాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. 
 
ద్రాక్ష పండ్ల గుజ్జును విడిగా తీసుకుని అందులో స్పూన్ మోతాదులో కొద్దిగా తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే నల్లటి చారలు, వలయాలు పోయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. 
 
ద్రాక్ష పండ్లలోని విటమిన్‌లు, మినరల్స్ శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలు బయటకు వెళ్లేలా చేస్తాయి. ద్రాక్ష పండ్లను రోజూ సలాడ్‌ల రూపంలో తీసుకుంటే మంచిదంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments