Webdunia - Bharat's app for daily news and videos

Install App

శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే....

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (14:25 IST)
జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది.
 
యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను సమభాగాల్లో కలిపి చూర్ణం చేసుకొని భద్రపరుచుకోవాలి. కప్పు నీటిని మరిగించి, ఆ నీటిలో పావు చెంచా పొడి వేసి టీ లా కాచుకోవాలి. చివర్లో ఎనిమిది తులసి ఆకులు వేసి వేడివేడిగానే తాగాలి. ఇలా నిత్యం చేస్తే వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. 
 
కప్పు పాలల్లో అరచెంచా శొంఠి పొడి వేసి కలిపి కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలిపి తాగాలి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను విడివిడిగా మెత్తాగా పొడి చేసి సమభాగాల్లో కలుపుకోవాలి. దీన్ని త్రికటు చూర్ణం అంటారు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జర్వం, దగ్గు, జలుబు, అలర్జీని నిరోధిస్తుంది.
 
చెంచాల శొంఠి కషాయంలో ఒక చెంచాడు ఆముదం కలిపి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తే విరేచనం సాఫీగా అవుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. సయాటికా తగ్గుతుంది. ఇలా రోజు విడిచి రోజు మూడుసార్లు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments