Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పు అధికంగా తింటే.. ఏమవుతుందో తెలుసా..?

ఉప్పు అధికంగా తింటే.. ఏమవుతుందో తెలుసా..?
, బుధవారం, 31 జులై 2019 (17:31 IST)
ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఉప్పు లేని ఆహారం తినాలంటే చాలా కష్టం. అయితే చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వరకు వంటకాలు ఏవైనా సరే.. ఉప్పు లేకుండా వాటికి రుచికాదు. తీపి పదార్థాలు పక్కన పెడితే మిగిలిన కూరలు, ఇతర ఏ వంటకంలోనైనా సరే.. ఉప్పు తప్పని సరిగా ఉపయోగించాలి.
 
ఉప్పు మంచిదే.. అందుకని మోతాదుకు మించి తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎక్కువగా ఉప్పు తింటే.. కలిగే సమస్యలు ఓసారి తెలుసుకుందాం..
 
1. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుంటాం. దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ లక్షణం కనిపిస్తున్నా మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకుంటే.. సరిపోతుంది.
 
2. ఉప్పు అధికంగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచులను గుర్తించలేవు. దాని ఫలితంగా ఏది తిన్నా సహించదు. అంతేకాదు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది.
 
3. ఉప్పు అధిక మోతాదులో తీసుకునే వారి శరీరంలో వాపులు వస్తాయి. ముఖ్యంగా కాలి మడమ భాగంలో ఉబ్బుతుంది. అక్కడే వేలితో టచ్ చేస్తే చర్మం లోపలికి పోతుంది. అందుకు కారణం ఆ భాగంలో నీరు ఎక్కువగా చేరడమే. ఉప్పు ఎక్కువగా తినేవారిలోనే ఈ సమస్య వస్తుంది. కనుక జాగ్రత్త వహించండి.
 
4. ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలో నీరు త్వరగా అయిపోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది. కనుక ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ముఖ్యంగా ఈ సమస్య వేసవికాలంలోనే వస్తుంది. కనుక ఉప్పు తగ్గిస్తే మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇవి తింటే మగవారు ఆ రిస్కులో పడరు...