Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర వ్యాధికి విరుగు కనిపెట్టండి: శాస్త్రవేత్తలకు వెంకయ్య పిలుపు

దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న చక్కెర వ్యాధిని శాశ్వతంగా నయం చేసే మందులను కనిపెట్టాలని దేశ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి, ఐఐఐఎం

Webdunia
మంగళవారం, 29 మే 2018 (09:13 IST)
దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న చక్కెర వ్యాధిని శాశ్వతంగా నయం చేసే మందులను కనిపెట్టాలని దేశ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి, ఐఐఐఎం సోమవారం జమ్మూలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ వంటి వ్యాధుల నివారణపైనా దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో సైన్స్‌కు విశేషమైన స్థానం ఉందని, చౌకగా ఔషధాలు లభ్యం కావడంతోపాటు ఆహార భద్రత, పాలఉత్పత్తి, అంతరిక్షం తదితర రంగాల్లో తనదైన ముద్ర వేసిందని గుర్తుచేశారు. 
 
పరిశోధనలు ఖచ్చితంగా విద్యావ్యవస్థలో అంతర్భాగం కావాలన్నా రు. మన దేశాన్ని విజ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి పరిశోధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. ప్రతి విషయాన్నీ ప్రశ్నించి, వాటికి సమాధానాలు తెలుసుకొనేలా చిన్నారులు, యువతను ప్రోత్సహించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments