Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చకర్పూరంతో వెన్నను తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే...

ఇటీవల కాలంలో చిన్నా పెద్ద వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగా లేకపోవడమే.... ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేసి ఉపశమనం ప

Webdunia
సోమవారం, 28 మే 2018 (22:13 IST)
ఇటీవల కాలంలో చిన్నా పెద్ద వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు  సరిగా లేకపోవడమే.... ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేసి ఉపశమనం పొందుతాము. కానీ అప్పటికి ఆ సమస్య తగ్గినా పూర్తిగా నయం కాదు. అయితే సహజంగా లభించే కొన్ని పదార్థాలతో మన కంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. మనం తక్కువ ఖర్చుతోనే మన కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్ల మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. కంటిచూపు మందగించడం తగ్గుతుంది.
 
2. కరివేపాకులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు రెండు కరివేపాకు రెమ్మల్ని తినడం వల్ల కంటి  సమస్యలు దూరమవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
 
3. పొన్నగంటికూర కళ్లకు మేలు చేయడంలో దానికదే సాటి. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే పొన్నగంటి ఆకు రసం ఓ కప్పు తీసుకోవాలి. దానిని నెయ్యితో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోజకు ఓ స్పూన్ చొప్పున తాగిస్తున్నట్లయితేవారికి కంటి సమస్యలు దూరమవుతాయి.
 
4. అలాగే కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు, కంటి చూపుని పెంచేందుకు కొన్ని పోషకాహారాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, చేపలు, గుడ్లు, క్యారెట్, టొమాటో వంటి వాటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments