Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ డ్యూటీలతో ప్రాణాలకు ముప్పు...

రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో విధులు నిర్వహించే వారిలో ఎక్కువ మంది గుండెపోటులకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇలా జరగడానిక

Webdunia
గురువారం, 12 జులై 2018 (11:43 IST)
రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో విధులు నిర్వహించే వారిలో ఎక్కువ మంది గుండెపోటులకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇలా జరగడానికిగల కారణాలను కూడా ఈ పరిశోధన విశ్లేషించింది.
 
* నైట్ షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల ఊబకాయం, గుండెపోటు, గుండె జబ్బులు వస్తాయట. 
* శరీర కణజాలం నిద్రాణమైన సమయంలో పనిచేయడంతో శరీర జీవక్రియల్లో రసాయన ప్రక్రియలు అస్తవ్యస్తమై జీవగడియారాల్లో పెను మార్పులకు దారితీస్తుందట. 
* నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ద్వారా మెదడులోని ప్రధాన గడియారం కాకుండా శరీరంలో ఉండే జీవ గడియారాలన్నీ ప్రభావితమవుతాయట. 
* రాత్రి వేళల్లో పనిచేయడానికి, తీవ్ర కిడ్నీ వ్యాధులకూ గురయ్యే ప్రమాదం ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. 
* శరీరంలోని కాలేయం, ప్రాంకియాస్‌, జీర్ణవ్యవస్థల్లో ఉండే గడియారాలు సైతం షిఫ్ట్‌ వేళలకు అనుగుణంగా మారిన నిద్ర, ఆహారపు అలవాట్లకు స్పందిస్తాయట.
* దీనివల్ల శరీరంలోని ఇతర గడియారాలు, మెదడులో ఉండే మాస్టర్‌ క్లాక్‌కు మధ్య సమతూకం దెబ్బతింటుందని అధ్యయనం తెలిపింది.
* ఈ అధ్యయనం రాత్రి, పగటి వేళల్లో పనిచేసే ఉద్యోగులపై చేపట్టారు. ఇందుకోసం రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు. 
* నైట్‌ షిఫ్ట్‌ల్లో నెలల తరబడి కొనసాగినట్టయితే కేన్సర్‌, ఒబెసిటీ, కిడ్నీ సహా పలు వ్యాధులు చుట్టుముట్టే ముప్పు ఉందని వైద్యుల హెచ్చరిక. 
* పైగా, రాత్రివేళల్లో పనిచేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. 
* ఇలాంటివారి సాయంత్రం వేళ్లల్లో ఆహారం తీసుకోవద్దని, పగటి కంటే సాయంత్ర సమయాల్లో నిద్రించడం మేలని సూచించారు.
* ఈ పరిశోధనను వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సర్రేలు సంయుక్తంగా నిర్వహించాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments