Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టీ" తాగితే డెత్ రిస్క్ తగ్గుతుందట.. (video)

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:03 IST)
Tea
భారత్‌తో పాటు ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు ఎక్కువగా తీసుకునే పానీయం టీ. ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో తేనీటికి మించిన ఆయుధం లేదు. టీ గురించి కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చింది. 
 
టీ ఎక్కువగా తీసుకుంటే డెత్ రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. టీ తాగనివారితో పోలిస్తే రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగేవారిలో మరణ ప్రమాదం తక్కువని డేటా విశ్లేషణ స్పష్టం చేసింది.
 
యూకేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు బ్లాక్ టీ వల్ల కలిగే సంభావ్య మరణాల ప్రయోజనాల గురించి తమ విశ్లేషణలో తెలుసుకున్నారు. రోజుకు రెండు కప్పులకు పైగా టీ తాగే వ్యక్తుల్లో ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం తాగని వారికంటే 9% నుంచి 13% వరకు తక్కువని NIH ఒక ప్రకటనలో తెలిపింది. 
 
40 నుండి 69 ఏళ్ల వయసు గల 4,98,043 మంది పురుషులు, స్త్రీలు ఈ అధ్యయనంలో పాల్గొనగా.. వీరిలో 89 శాతం మంది బ్లాక్ టీ వెరైటీని తాగినట్లు చెప్పారు. అయితే ఇక్కడ బ్లాక్‌ టీ తాగే అలవాటు లేకుంటే పాలు లేదా చక్కెర జోడించినప్పటికీ ఆరోగ్య ప్రయోజనాల్లో గణనీయమైన తగ్గింపు కనిపించలేదు. కాకపోతే చక్కెర, పాలలోని సంతృప్త కొవ్వులను పరిమితం చేయడాన్ని ఆరోగ్య నిపుణులు ప్రోత్సహిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments