Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానబెట్టిన బాదం పప్పుల్ని రోజూ తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (17:55 IST)
నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదంపప్పుపై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. 
 
అదే కనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది.  ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. 
 
వీటిని రోజూ పరగడుపున లేదంటే.. అల్పాహారానికి అరగంట ముందు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తొలగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవచ్చు. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చిన లోపాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలకు బాదం పప్పులు ఎంతో మేలు చేస్తాయి. 
 
పిల్లలకు బాదం పప్పుతో చేసిన పొడిని పాలలో కలిపి ఇవ్వడం ద్వారా వారి శరీరానికి కావలసిన యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు కూడా నానబెట్టిన బాదం పప్పులు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments