Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉలిక్కిపడిన భారతం... 'నిపా' వైరస్ గాలిలో వ్యాపిస్తుందా?

భారతావని ఒక్కసారి ఉలిక్కిపడింది. అంతుచిక్కని వైరస్‌ సోకి ఏకంగా 10 మంది చనిపోయారు. ఇది యావత్ భారతవనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేనా, ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన ఓ నర్సు కూడా ప

Webdunia
బుధవారం, 23 మే 2018 (09:40 IST)
భారతావని ఒక్కసారి ఉలిక్కిపడింది. అంతుచిక్కని వైరస్‌ సోకి ఏకంగా 10 మంది చనిపోయారు. ఇది యావత్ భారతవనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేనా, ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన ఓ నర్సు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇది మరింత విషాదానికి గురిచేసింది. ఆ వైరస్ పేరు నిపా. అసలు ఇలాంటి అంతుచిక్కని వైరస్ ఎలా వ్యాపించింది? ఎక్కడ నుంచి వచ్చింది? ఈ వైరస్‌ను నియంత్రించగలమా అనేది పరిశీలిస్తే...
 
నిజానికి నిపా వైరస్‌ కొత్తదేం కాదు. అరుదైనది, తీవ్రమైనది, ప్రాణాంతకమైనది. ఈ వైరస్‌తోనే ముగ్గురు కేరళ వాసులు చనిపోయారని పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ధృవీకరించింది. ఆ తర్వాత కొన్నేళ్లుగా వినిపించకుండా పోయింది. ఇపుడు మళ్లీ తెరపైకి వచ్చింది. 
 
ఈ వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా వెలుగులోకొచ్చిన 'జూనోసిస్' (జంతువు నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌)గా ఇంతకుముందే గుర్తించింది. 'ఫ్రూట్‌ బ్యాట్స్' అనే ఒక రకం గబ్బిళాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పని చేస్తాయని కూడా గుర్తించారు. 
 
ఈ వైరస్‌ 1998లోనే మలేసియా, సింగపూర్‌లో బయటపడింది. అప్పట్లో ఈ వైరస్‌ పందుల్లో కనిపించి, వాటి ద్వారా మనుషులకు వ్యాపించింది. గబ్బిళాలు, పందులు, మనుషులు... వీళ్లలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకవచ్చు. ఈ వైరస్‌ సోకిన గబ్బిళాలు ఎంగిలి చేసిన తాటి గుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకింది. 
 
ఈ వైరస్‌ గాలి ద్వారా సోకదు. అప్పటికే వైరస్‌ సోకిన జంతువు లేదా మనిషితో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన వెంటనే తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్టు అనిపించే కన్‌ఫ్యూజన్‌ మొదలైన లక్షణాలుంటాయి. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ ముదిరి కోమాలోకి వెళ్లిపోతారు. ఆ దశలో బ్రతికించడం కష్టం.
 
ఈ వైరస్‌ను నియంత్రించే టీకాలు ఇంకా తయారు కాలేదు. అయితే ఈ వైరస్‌ను సమర్థంగా చంపగలిగేది ఇంటెన్సివ్‌ సపోర్టివ్‌ కేర్‌ చికిత్స ఒక్కటే! ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే వైరస్‌ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిళాలు లేకుండా చూసుకోవాలి. చికిత్స చేసే వైద్యులు మాస్క్‌లు, గ్లోవ్స్‌ వేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ నీతులు చెప్పడం హాస్యాస్పదం : అద్దంకి దయాకర్

వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్

మానసిక సమస్యతో బాధపడుతున్న కొడుకును చూడలేక....

మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై విద్యార్థుల దాడి

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

తర్వాతి కథనం
Show comments