Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు తోడుకి పెరుగు ఇక అక్కర్లేదు.. మరి ఎలా?

సాధారణంగా పాలు తోడుకి పెరుగు తప్పనిసరి. కానీ, ఇకపై పెరుగు అక్కర్లేదంటున్నారు తిరుపతి డైరీ శాస్త్రవేత్తలు. పెరుగుకు ప్రత్యామ్నాయంగా సరికొత్త పౌడర్‌ను తయారు చేశారు. ఇది ప్రయోగ దశలోనే విజయవంతమైంది.

Webdunia
మంగళవారం, 22 మే 2018 (13:48 IST)
సాధారణంగా పాలు తోడుకి పెరుగు తప్పనిసరి. కానీ, ఇకపై పెరుగు అక్కర్లేదంటున్నారు తిరుపతి డైరీ శాస్త్రవేత్తలు. పెరుగుకు ప్రత్యామ్నాయంగా సరికొత్త పౌడర్‌ను తయారు చేశారు. ఇది ప్రయోగ దశలోనే విజయవంతమైంది. దీనికి చేమిరి సాచెట్ అనే పేరు కూడా ఖరారు చేశారు. అతి త్వరలోనే ఈ చేమిరి సాచెట్స్‌కు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
 
ఈ ప్యాకెట్‌ తీసుకొచ్చి గోరువెచ్చని పాలలో వేస్తే చాలు. ఆ పాలు అలా గడ్డకట్టి పెరుగు అయిపోతుంది. అది కూడా జస్ట్ మూడు గంటల్లోనే. మామూలుగా అయితే 6 గంటల సమయం పడుతుంది. కానీ, పెరుగు కావటానికి ఈ రెడీమేడ్ ప్యాకెట్ కలపటం వల్ల 2 గంటల్లోనే పెరుగు తయారవుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా, పాలు పెరుగుగా మారటానికి ల్యాక్టో‌కోకస్ అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియాను పాల నుంచి సేకరించారు. దాన్ని మూడు దశల్లో వేరు చేశారు. దాని నుంచి రెడీమేడ్ తోడును సృష్టించారు. ఇది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. ప్రస్తుతం పాలు, పెరుగు ఎక్కడెక్కడ అమ్ముతున్నారో.. ఈ తోడు ప్యాకెట్లు కూడా అక్కడ అందుబాటులో ఉండనున్నాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments