మతిమరుపు మాయం కావాలంటే.. ఆకుకూరలు తినాలట..

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (11:50 IST)
వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా మందగిస్తాయి. ఆవకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా డైట్‌లో తప్పకుండా ఆకుకూరలను చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
మతిమరుపు సమస్యలు ఉత్పన్నం కాకముందే జాగ్రత్తపడటానికి ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తింటే మెదడు, శరీరం రెండూ చురుగ్గా పని చేస్తాయి. పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అలాగే బ్లూ బెర్రీస్‌లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి. 
 
ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లతో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అంతేకాకుండా సాల్మన్ ఫిష్‌లో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మార్చడంలో ఉపయోగపడతాయి. మానసిక ఆందోళనను దూరం చేయడంలో కూడా ఇవి తోడ్పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని ఇంధన పొదుపు పిలుపు: విధాన్ భవన్‌కి మోటాల్ సైకిల్ పైన వచ్చిన మహారాష్ట్ర సీఎం, వీడియో

కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తో సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు

శస్త్రచికిత్స అనంతరం అమరావతికి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్

నల్లకోటు ధరించి న్యాయవాదిగా మారిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు?

ఉత్కంఠకు తెర : కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ

'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments