Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిమరుపు మాయం కావాలంటే.. ఆకుకూరలు తినాలట..

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (11:50 IST)
వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా మందగిస్తాయి. ఆవకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా డైట్‌లో తప్పకుండా ఆకుకూరలను చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
మతిమరుపు సమస్యలు ఉత్పన్నం కాకముందే జాగ్రత్తపడటానికి ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తింటే మెదడు, శరీరం రెండూ చురుగ్గా పని చేస్తాయి. పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అలాగే బ్లూ బెర్రీస్‌లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి. 
 
ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లతో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అంతేకాకుండా సాల్మన్ ఫిష్‌లో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మార్చడంలో ఉపయోగపడతాయి. మానసిక ఆందోళనను దూరం చేయడంలో కూడా ఇవి తోడ్పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments