Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరూరించే గోంగూర మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం..

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:51 IST)
Biryani
గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌లాంటి భయంకర వ్యాధులను కూడా నివారించడానికి గోంగూర ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు ఏదో ఒక రూపంలో గోంగూరను తీసుకుంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది. అలాగే మటన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. ఈ రెండింటి కాంబోలో గోంగూర మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
బియ్యం - కేజీ
మటన్ - కేజీ
గోంగూర తరుగు - నాలుగు కప్పులు 
పెరుగు - 2 కప్పులు
పచ్చిమిర్చి - ఏడు 
నెయ్యి - 1 కప్పు
దాల్చిన చెక్క- 2 చిన్న ముక్కలు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్స్
లవంగాలు - 4
యాలకులు - 4
కారం - 2 టేబుల్ స్పూన్స్
పుదీనా తరుగు - 4 కప్పులు 
ఉల్లిపాయ తరుగు - మూడు కప్పులు
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం: 
ముందుగా బాస్మతి బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడైన తరువాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క నిలువుగా తరిగిన మిర్చి, ఉల్లి ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా వేసి రెండు నిమిషాల తరువాత గోంగూర వేయాలి. తర్వాత పెరుగు, చికెన్, కారం, ఉప్పు వరుసగా వేసి సన్నటి సెగపై ఉడికించాలి.
 
మరో గిన్నెలో నీటిని మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేయాలి. అన్నం సగం ఉడికిన తరువాత దాన్ని వార్చి చికెన్ ఉడుకుతున్న గిన్నెలోకి వేయాలి. ఆవిరి పోకుండా ఉండేలా నిండుగా మూతపెట్టి, ఆ తర్వాత సన్నటి సెగపై 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి గోంగూర మటన్బిర్యానీ రెడీ అయినట్లే. ఈ గోంగూర మటన్ బిర్యానీకి.. ఉల్లి పెరుగు లేదంటే.. చికెన్ 65 సైడిష్‌‍తో టేస్ట్ చేస్తే రుచి అదిరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments