Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఈ పండ్లను తీసుకుంటే..? పెరుగులో ముంచిన ద్రాక్షల్ని?

వేసవికాలం వచ్చేసింది.. ఎండలను తెచ్చేసింది.. మండిపోతున్న ఎండల్లో శరీర తాపాన్ని తగ్గించుకునేందుకు పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుక

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (13:42 IST)
వేసవికాలం వచ్చేసింది.. ఎండలను తెచ్చేసింది.. మండిపోతున్న ఎండల్లో శరీర తాపాన్ని తగ్గించుకునేందుకు పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. ఇందుకు గాను ఈ పండ్లను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.. 
 
కీరదోసను తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులోని లో-కెలోరీలు, ఫైబర్, యాంటీ-యాక్సిడెంట్లు, నీటి శాతం మధుమేహాన్ని తగ్గిస్తుంది. వేసవిలో రోజూ కీరదోసను తీసుకోవడం మరిచిపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ద్రాక్ష రసం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మైగ్రేన్‌ను తగ్గించే వీటిలో పొటాషియం పుష్కలంగా వుంటుంది.
 
వృద్ధాప్య ఛాయలను ఇది పోగొడుతుంది. పెరుగులో ముంచిన ద్రాక్షలను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటితో పాటు ఆరెంజ్, పుచ్చకాయ, ఆపిల్, స్ట్రాబెర్రీ, కివీ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా వేసవికాలంలో డీ-హైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. 
 
అలాగే వేసవిలో ప్రతి రోజు తినే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు, గుడ్డు, పాలు వంటివి ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే వెల్లుల్లి వంటల్లో అధికంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి పోటెత్తిన ఆంధ్రాప్రజలు.. రాజధాని పనులు పునఃప్రారంభం

భారతదేశం అణుబాంబు స్మైలింగ్ బుద్ధను వేస్తే పాకిస్తాన్ ఏమేరకు నాశనమవుతుందో తెలుసా?

అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...

ఆ మూడు దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నాం : బిలావుల్ భుట్టో

LoC: బంకర్లలో భారత సైనికుల వెన్నంటే వున్నాము, 8వ రోజు పాక్ కాల్పులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

తర్వాతి కథనం
Show comments