Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె జబ్బులకు చెక్ పెట్టే చేపలు..

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:45 IST)
సోయా, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు తీసుకుంటే గుండె పదిలంగా వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజూ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అధిక కొవ్వుతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించుకోవచ్చునని వారు చెప్తున్నారు. 
 
అందుకే ప్రతిరోజూ రెండు కప్పుల సోయా, తృణధాన్యాలు, గింజలను తీసుకోవడం ద్వారా శరీరంలోని హానికర ఎల్డీఎల్ కొవ్వులను ఐదు శాతం మేరకు తగ్గించుకోవచ్చునని.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో భాగంగా ప్లాంట్ ప్రొటీన్లతో పాటు కొవ్వును తగ్గించే ఓట్స్, బార్లీ వంటివి తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు. 
 
అలాగే గుండె ఆరోగ్యంగా వుండాలంటే.. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను రోజూ గుప్పెడు మోతాదులో తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాటిల్లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తనాళాలు వాపుకు గురి కాకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments