Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెల్లుల్లి రెబ్బల్ని వేడి నీటిలో వేసుకుని తీసుకుంటే?

వెల్లుల్లి రెబ్బల్ని వేడి నీటిలో వేసుకుని తీసుకుంటే?
, ఆదివారం, 12 మే 2019 (12:27 IST)
వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచుకుని వేడినీటిలో వేసుకుని తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తరచూ జలుబూ, జ్వరాలకు గురయ్యేవారు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలూ, తేనె, అల్లం కలిపి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 
 
ఈ రెబ్బల్లోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయులు కూడా పెరగకుండా చేస్తాయి. వెల్లుల్లి టీని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 
 
వెల్లుల్లి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. రోజూ ఒక కప్పు వెల్లుల్లి టీని తాగితే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం తగ్గిపోతాయి. వెల్లులిని తరచూ తీసుకోవడం వల్ల రొమ్మూ, ఉదర, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్డు సొనలో బాగా మగ్గిన అరటిపండు గుజ్జును కలిపి?