Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీజన్లతో సంబంధం లేదు.. సపోటాతో బరువు పరార్..

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (22:02 IST)
సపోటాలో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సీజన్లకు సంబంధం లేకుండా లభించే ఈ పండ్లను తీసుకోవడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. సపోటాలో విటమిన్ ఏ పుష్కలంలో ఉంటుంది. వృద్ధులు సైతం సపోటా పండును తినడం వల్ల వాళ్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గర్భవతులు, పాలిచ్చే తల్లులు సపోటా పండ్లను తీసుకుంటే మంచిది. రక్తస్రావాన్ని తగ్గించడంలో సపోటా పండ్లు సహాయపడతాయి. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్న సపోటా పండ్లు వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
 
గ్లూకోజ్‌ను సమృద్ధిగా కలిగి ఉండే సపోటా తక్షణమే శక్తిని ఇస్తుంది. ఆటలు ఎక్కువగా ఆడేవాళ్లు సపోటా పండ్లను తీసుకుంటే మంచిది. సపోటా పండ్లు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పని చేస్తాయి. వాపు, నొప్పులను తగ్గించడంలో సపోటా పండ్లు ఎంతగానో సహాయపడతాయి. బాడీలో వేడి పెరిగిపోతే... సపోటాలు తినాలి. వీటిలోని టాన్నిన్... వేడిని పోగొట్టి చలవ చేస్తుంది.
 
సపోటాల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి. సపోటాల్ని రెగ్యులర్‌గా తింటే... ముసలివాళ్లు అయ్యాక... మందులు ఎక్కువగా వాడాల్సిన పని ఉండదు. సపోటాల్లోని ఫోలేట్స్, కాల్షి.యం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలెనియం... ఎముకలు ధృఢంగా మారేలా చేస్తాయి. సపోటాల్లోని మెగ్నీషియం... రక్త నాళాల్ని చురుగ్గా చేస్తుంది. అలాగే పొటాషియం... బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తం సరిగా లేని వాళ్లు సపోటాలు తినాలి. బరువు తగ్గాలంటే... బాడీకి వాటర్ ఉండాలి. మెటబాలిజం సరిగ్గా ఉండాలి. ఆ పనిని సపోటాలు చూసుకుంటాయి. ఓ రెండు సపోటాలు తిని... వర్కవుట్ చేసుకుంటే బెటర్.
 
అలాగే కొన్ని క్యాన్సర్లను నివారించడంలో సపోటా పండ్లు ఎంతగానో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు సపోటా పండ్లలో పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎముకల పటుత్వాన్ని పెంచడంలో సహాయపడతాయి. సపోటా పండ్లను తీసుకోవడం ద్వారా కాల్షియం, పాస్పరస్, ఐరన్ లభిస్తాయని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments