ఉబ్బసం వ్యాధి ఎలా ఉంటుందంటే..?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (16:01 IST)
ఉబ్బసం వ్యాధి వచ్చిందంటే ఇక ప్రాణం పోయినట్లే అనుకుంటారు చాలామంది. దీన్ని అంటురోగంగా భావించి వ్యాధిగ్రస్తులను దూరంగా పెడుతుంటారు. అయితే కాలం మారిపోయింది. కొత్త కొత్త మందులు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ మందులు వాడితో కొంతవరకే ఈ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలుగుతోంది. ఏదైనా కారణం కావచ్చు. అలర్జి కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఏ కారణాలు లేకున్నా ఈ వ్యాధి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. వంశపార్యపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
 
ఉబ్బసం అనేది పూర్తిగా తగ్గిపోయే వ్యాధి కాదు. కాకపోతో తగినంత దానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా వాటి మూలాన కలిగే లక్షణాల తీవ్రత, ఇబ్బందులను నివారించుకుంటూ ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చును. ఉబ్బసం వలన కలిగే లక్షణాలు ప్రతిసారీ ప్రతిఒక్కరిలో ఒకలాగా ఉండవు. కొన్ని తీవ్రతరంగా ఉంటాయి. తీవ్రంగా ఉన్న ఉబ్బసంలో గాలి మార్గాలు చాలా వరకు మూసుకోవడం వలన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలకు ప్రాణవాయువు అందడం కష్టమైపోతుంది.
 
ఉబ్బసం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఉబ్బసం ఉన్న వ్యక్తులలో గాలి మార్గాల లోపలి భాగం వాచినట్టవుతుంది. ఈ వాపు మూలంగా గాలి మార్గాలు సన్న బడుతాయి. ఏవైనా పడని రసాయనాలు, ఇతర పదార్థాల వాసనలు గాలి ద్వారా పీల్చినప్పుడు లేదా నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కవయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 
 
ప్రతిఫలంగా వాటిగుండా ఊపిరితిత్తులకు తక్కువ గాలి చేరడం జరుగుతుంది. దీని కారణంగా ఊపిరి పీల్చినప్పుడు పిల్లి కూతలు, దగ్గు, ఛాతిపట్టినట్టుగా అనిపించడం, శ్వాస పీల్చుకోవడంలో కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే.. రాత్రి సమయంలో, తెల్లవారు జామున ఇటువంటి లక్షణాలు కనబడుతాయి. 
 
ఇది వైద్య అత్యవసర పరిస్థితి, త్వరితగతిన వైద్య సహాయం అందని పక్షంలో ఇది ప్రాణాంతకం కూడా కాగలదు. ఉబ్బసం ఉన్న వ్యక్తులు ఏ కారణం చేత వారికి ఈ లక్షణాలు కలుగుతున్నాయో గుర్తించి అవి కలగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ వైద్యుని సలహా మేరకు మందులను కూడా వాడుకోవచ్చును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments