పసుపులో మీగడ కలిపి ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (12:11 IST)
అధిక ధరలు చెల్లించి ఫేస్‌ఫ్యాక్స్, స్క్రబ్బస్ వాడడం కంటే సహజసిద్ధంగా లభించే పసుపుని వాడడం మంచిదని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. పసుపు వాడకం వలన మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. పసుపుతో ప్యాక్, స్క్రబ్ ఇంట్లోనే తయారుచేసుకుని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ ప్యాక్ ఎలా చేయాలో.. ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం...
 
2 స్పూన్ల పసుపులో స్పూన్ బియ్యం పిండి, టమోటా రసం, పాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ తరువాత ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ముఖంపై గల మొటిమలు, నల్లటి మచ్చలు పోయి ముఖం కాంతింతంగా, మృదువుగా తయారవుతుంది.
 
3 స్పూన్ల పసుపులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
 
ఒక బౌల్‌లో కొద్దిగా పసుపు వేసుకుని అందులో స్పూన్ మీగడ, శెనగపిండి కలిపి స్క్రబ్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాలపాటు ముఖాన్ని మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

cockraoch janata party, నా బొద్దింక జనతా పార్టీ హ్యాక్ అయ్యింది: అభిజిత్ దిప్కే

ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా లెనిన్ టీజర్ వచ్చేసింది

Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?

Ramcharan: నా కూతురిని ఎత్తుకున్నా నొప్పి పెడుతుంది : రామ్ చరణ్

ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు : యువసామ్రాట్

Nagarjuna's Memories: విక్రమ్ కు 40 ఏళ్ళు - మనం ను మర్చిపోలేని తేదీ : నాగార్జున మెమొరీస్

తర్వాతి కథనం
Show comments