Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ?

Advertiesment
పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ?
, సోమవారం, 31 డిశెంబరు 2018 (13:56 IST)
మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన నివారింపబడతాయి. రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణిని కలిపి ఇంట్లో ధూపం వేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు. పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మ రోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. 
 
పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలుమచ్చలు నివారించవచ్చు.
 
వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. ఇలా చేస్తే మొటిమలు మాయమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట..