Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట..

తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట..
, సోమవారం, 31 డిశెంబరు 2018 (13:44 IST)
అవును. తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట.. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. అందుకే తెల్లటి బియ్యాన్ని రోజులో ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
 
అలాగే.. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా చప్పదనముంటుంది. దీంతో అన్నానికి కూరను ఎక్కువగా వేసుకోవడం.. కేలరీలు ఎక్కువగా వుండే పదార్థాలను వాటితో చేర్చుకోవడం చేస్తుంటాం. ఇలా చేస్తే వాటిలోని కేలొరీల కారణంగా బరువు సులభంగా పెరుగుతారని వైద్యులు చెప్తున్నారు. 
 
తెల్లటి బియ్యంలో శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగ్గా వుండవు. ఫలితంగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైన ఇబ్బందులు తప్పవు. అందుకే దంపుడు బియ్యాన్ని ఉపయోగించాలని వారు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేపలు తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...?