Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమజ్జయంతి... జై హనుమాన్

Webdunia
బుధవారం, 25 మే 2022 (12:40 IST)
ఈరోజు హనుమజ్జయంతి. హనుమంతుడు వైశాఖమాసంలో బహుళ దశమి, శనివారం కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఈ శుభ తిథిని హనుమజ్జయంతిగా జరుపుకుంటారు. ఈ పుణ్య దినాన భక్తులు హనుమంతుని ఆలయాలకు వెళ్ళి స్వామిని పూజించి వడమాలలను వేసి, అప్పాలను స్వామికి సమర్పిస్తారు. తమలపాకులతో హనుమంతుడిని పూజిస్తారు. ఈ శుభదినాన సుందరకాండను పారాయణ చేసినట్లయితే హనుమంతుని కృపను పొందవచ్చు. ఆలయాల్లోనే గాక, గృహాల్లో కూడా ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శుచి శుభ్రతలతో పూజించవచ్చు. 

 
వైశాఖ బహుళ నవమి నాడు రాత్రి ఉపవాసం ఉండి, నేలపై చాప పరుచుకొని నిద్రించాలి. మర్నాడు దశమి నాడు తెల్లవారు జామునే లేచి తల స్నానం చేయాలి. గడపలను పసుపు కుంకుమలతో అలంకరించి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. పూజ గదిలో ప్రత్యేకంగా ఒక చిన్న స్టూలు మీద గానీ, పీట మీద కానీ హనుమంతుని పటాన్ని ఉంచాలి. 

 
హనుమంతుని ఉంచే ఆసనానికి పసుపు రాసి, కుంకుమతోను, బియ్యపు పిండితోను బొట్లను పెట్టి, పీఠం మధ్యలో బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. హనుమంతుని విగ్రహానికి లేక పటానికి సింధూరాన్ని పెట్టాలి. ఆంజనేయుడు సింధూరాన్ని ఇష్టపడతాడు గనుక సింధూరపు అలంకరణ వల్ల స్వామి వారి కటాక్ష వీక్షణాలు భక్తులకు కలుగుతాయి. విగ్రహానికి ఎర్రని వస్త్రాన్ని ధరింపజేయాలి.

 
ఆంజనేయుని పూజకు ఎర్రని పూలు, కుంకుమ కలిపిన ఎర్రని అక్షింతలు ఉపయోగించాలి. హనుమంతుని పూజ చేయబోయే ముందు పసుపుతో చేసిన వినాయకుడిని ముందుగా పూజించాలి. ఆ తర్వాత ఆంజనేయుడిని పూజిస్తే చక్కని ఫలితం లభిస్తుంది. తాము చేపట్టిన కార్యాలు, తాము అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. ఆంజనేయ స్వామిని షోడశోపచారాలతో అష్టోత్తరం చదువుతూ ఎర్రని పుష్పాలతోను, తమలపాకులతోను పూజించాలి. 

 
వడలతో తయారు చేసిన మాలను హనుమంతుని మెడలో అలంకరించాలి.  పూజ పూర్తయిన తరువాత ఆత్మ ప్రదక్షణ నమస్కారంతో మన ఆలోచనలను, చిత్తాన్ని భగవంతుని మీదనే నిలుపుకోవాలి. పూజానంతరం స్వామికి అప్పాలు, ఉడికించిన సెనగలు, అరటిపండ్లు, వడలు, పొంగలిని కానీ లేదా పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. హనుమంతుడు శ్రీరామునికి ప్రియ శిష్యుడు. మహా భక్తుడు. కావున హనుమజ్జయంతి నాడు శ్రీరాముడిని పూజిస్తే, హనుమంతునికి ఆపార ఆనందం కలుగుతుంది. తన స్వామిని పూజించిన వారి పట్ల హనుమంతుడు ప్రసన్నుడవుతాడు.

 
హనుమంతుడిని పూజిస్తే గ్రహ పీడలు నశించిపోతాయి. గాలి, ధూళి లాంటివి హనుమంతుని దర్శనం, ప్రార్ధన, భజన, హనుమాన్ చాలిసా, ఆంజనేయ దండకం పఠించడంతోనే పారిపోతాయి. హనుమంతుడు బలశాలి, ధీరుడు, కార్యశూరుడు. అటువంటి స్వామిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దయ్యం, భూతం, చేతబడి లాంటివి హనుమంతుని భక్తుల దరిచేరవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments